
కీసర గుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
శివరాత్రి సందర్భంగా కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ టీ. పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసర గుట్ట చైర్మన్ తాటకం నారాయణ శర్మ, టెంపుల్ డైరెక్టర్లు ఉన్నారు.