May 11, 2024, 03:05 IST/ఖమ్మం
ఖమ్మం
బీజేపీకి ఓటువేస్తే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు
May 11, 2024, 03:05 IST
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్ రెడ్డి కోరారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటువేస్తే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవని, మోదీ నియంత మాదిరి పరిపాలిస్తారని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.