కాంగ్రెస్ పార్టీకి ఆరు నెలల్లో ప్రజల వ్యతిరేకత
గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనా అని చెప్పి, ప్రతీకార పాలన తీర్చుకుంటుందని ప్రభుత్వ మాజీ చీప్ విప్, బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు.