హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరిలో నమోదైన 9 గంజాయి కేసులతో పాటు, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.