హన్మకొండ, వరంగల్, కాజీపేట ఏరియాలలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు తమ వాహనాల్లో వేయిస్తంభాల గుడికి తరలివస్తారు. ఆలయం దగ్గర పరిసరాలలో ఎలాంటి పార్కింగ్ స్థలాలు లేవు. సాధ్యమైనంత త్వరగా ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యం తో ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేయడం జరుగుతుందని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. గుడి వైపు వచ్చే భక్తుల వాహనాలను అలంకార్ జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తారు.