May 01, 2024, 10:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఎండల తీవ్రత దృష్ట జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్
May 01, 2024, 10:05 IST
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే తప్పా బయటకు రాకూడదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రజలను కోరారు. ఎండల తీవ్రత రోజు రోజుకు ఎక్కువ వున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయని, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.