వరద నీటిలో పడి 13 నెలల బాలుడు మృతి
వరద నీటిలో బాలుడి మునిగి మృతి చెందిన ఘటన షాద్ నగర్ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. నోబుల్ పార్క్ కాలనీలో నివసిస్తున్న మీర్ అహ్మద్-రోఫన్ దంపతులకు ఆరిఫ్ మన్సూర్ (13 నెలలు) ఉన్నాడు. వరద నీటిలో గంతులు వేస్తూ.. నీళ్లలో మునిగి మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించినా.. బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమైంది. కాగా, పొట్టికూటి కోసం బీహార్ రాష్ట్రం నుంచి వీరు వలస వచ్చారు.