సైనిక్ డిఫెన్స్ అకాడమీ షాద్ నగర్ శాఖ అందించిన ఉచిత శిక్షణతో 12 మంది యువకులు అగ్నిపథ్ పథకం ద్వారా అగ్నివీరులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకుడు నక్క నరేందర్ ను పోలీసులు ఘనంగా సత్కరించారు. సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నివీరులుగా ఎంపికైన దయానంద్, రాహుల్, నవీన్, సురేష్, గణేష్, చరణ్ నాయక్, ఆనంద్, శ్రావణ్, చందు తదితరులను అభినందించారు.