ముంబై ఉగ్రదాడి కేసులో సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో తహవూర్ రాణాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రాణా కేసు విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది.