బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ రూల్ ప్రకారం నడుచుకోవాలని ఖాతాదారుల వద్ద కమిషన్ వసూలు చేయకూడదని హనుమకొండ జిల్లా అదరపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో, జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డు ను అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతివారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు.