నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని కోరుతూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్ ను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ కుమార్ పల్లిలో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారన్నారు.