వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో హెచ్ఐ వి పేషేంట్ ఆత్మహత్య
హెచ్ఐవి వ్యాధితో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ మొలంగూరి రాజు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నాడు. మనస్తాపం చెందిన అతడు వరంగల్ రైల్వేస్టేషన్లో గురువారం పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారు వచ్చి రాజును అంబులెన్స్ లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.