బల్దియాలో దొంగలు పడ్డారు

60பார்த்தது
వరంగల్ మహానగర పాలక సంస్థలో పర్యవేక్షణ లోపం మెండుగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ ఆవరణలోని పార్క్ కి వేసిన గ్రిల్స్ గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ పక్కనే నిర్మిస్తున్న టాయిలెట్ పనులలో ఉన్న స్టీల్ కొంతమంది ఎత్తుకుపోయినట్లు కూలీలు తెలిపారు. కార్పొరేషన్ లో సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ వారి పరిరక్షణ లేకపోవడం వల్లే ప్రజాధనం దొంగల పాలు అవుతుందని ప్రజలు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி