పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2024 శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పాలిసెట్ వరంగల్ కన్వీనర్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 5, 624 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.