రక్తదానం మరొకరికి ప్రాణదానం

58பார்த்தது
రక్తదానం మరొకరికి ప్రాణదానం
ప్రాణపాయ పరిస్థితిలో ఉన్న వారిని రక్తదానంతో కాపాడవచ్చని ఖిలవరంగల్ చింతల్ వాకింగ్ గ్రౌండ్ ఇంచార్జి రావుల రాజేష్ అన్నారు. గురువారం ఖిలావరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ హనుమకొండ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు 36మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మదన్ మోహన్ రావు, రక్తదాన మోటివేటర్ శ్రీనివాస్, పద్మజా రావు, రాజేందర్, సురేందర్రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி