వరంగల్ రంగశాయిపేటలోని పట్టణ ఆరోగ్యకేంద్రంలో గురువారం మానవ, బాలల అక్రమరవాణా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్-10 , భ్రూణహత్యలపై ఆశా కార్యకర్తలకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కు డాక్టర్ వేద ఆధ్వర్యంలో అవగాహన కలిగించారు. జిల్లాలో మండలంలో బ్రూణ హత్యలు జరగకుండా ఇంటింటికి వెళ్లి గర్భిణీ స్త్రీలకు, ఆడపిల్లలైతే ఇంటికి మహాలక్ష్మి అని వారిని సమానంగా చూడవలసిన బాధ్యత ఉందన్నారు.