జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ బుధవారం సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యుత్, త్రాగునీరు తదితర మౌలిక వసతుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణయిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.