జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఫ్లకార్డులతో ఓ కుటుంబం తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం నిరసనకు దిగింది. మల్కాపురం లక్ష్మయ్య అనే వ్యక్తి తమకు మోసం చేశాడని తమ 15 లక్షల రూపాయల డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. ఎమ్మెల్యే కడియం స్పందించి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.