జనగామ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలో 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డిఐఈఓ ఆంజనేయరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విభాగంలో 1275 మందికి గాను 1239 మంది, ఒకేషనల్ విభాగంలో 312 మందికి గాను 287 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. రెండవ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 442 మంది విద్యార్థులకు గాను 427 మంది, ఒకేషనల్ విభాగంలో 90 మంది గాను 84 మంది హాజరయ్యారని తెలిపారు.