పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం బురాహన్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంతల కౌశమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఈ సందర్భంగా రాష్ట్రమాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి పార్థివా దేహానికి నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.