జనగాం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద పట్టభద్రులు భారీగా తరలివచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. సోమవారం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద పాలకుర్తి తహసీల్దార్ వెంకటేశం, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై సాయిప్రసన్న కుమార్ లు పర్యవేక్షిస్తున్నారు.