త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థినులు

70பார்த்தது
త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థినులు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కునుసొతు అంజలి, బానోతు పల్లవి లు బాసర ట్రిపుల్ ఐటి ఇంజనీరింగ్ విద్యకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 10వ తరగతిలో కునుసోత్ అంజలి దాసుగూడెంతండా 9. 8 జిపిఏతో మండల టాపర్ గా నిలిచిందని, బానోతు పల్లవి పెద్దతండ 9. 7 జిపిఏ సాధించి ఉత్తమ విద్యార్థినిలుగా నిలిచారని వివరించారు.

தொடர்புடைய செய்தி