రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ అధ్యక్షతన రైతుల మహాజనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రైతుభరోసా, రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు.