బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

83பார்த்தது
బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామంలో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన వశపాక కిష్టయ్య కుటుంబానికి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. శనివారం చైర్మన్ మడిపెద్ది నాగార్జున్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బండి రాజు, రఘు, గజవెళ్లి నాగరాజు, నరేష్, గణేష్, ప్రశాంత్, ఆనంద్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி