30 లక్షల ఖర్చుతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భారీ సెట్టింగ్

76பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ్ భాయ్ నగర్ లో గురువారం నుండి దేవీ శరన్నవరాత్రి వేడుకల ఏర్పాట్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సుమారు రూ. 30లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. సుమారు కిలో మీటర్ మేర ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్ లైట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లతో పట్టణం మొత్తం ప్రత్యేక శోభ సంతరించుకుంది.

தொடர்புடைய செய்தி