ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు

78பார்த்தது
ఇసుక లారీలను అడ్డుకున్న మహిళలు
ఏటూరునాగారంలోని ఐటిడిఏ గిరిజన భవన్ సమీపంలో మంగళవారం ఇసుక లారీలను మహిళలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కన్నాయిగూడెం మండలంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీలకు నిత్యం వందల సంఖ్యలో లారీలు తమ ఇళ్ల ముందు నుండి వెళ్తున్నాయని అన్నారు. దీంతో దుమ్ము ధూళితో తాము అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. రోడ్డుపై దుమ్ము లేవకుండా ప్రతిరోజు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీటిని పోయాలన్నారు.

தொடர்புடைய செய்தி