ఏటూరునాగారంలో పోలైన ఓట్లు 901

83பார்த்தது
ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం 4 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. కాగా మండలంలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్ల వివరాలను అధికారులు వెల్లడించారు. బూత్ నంబర్ 204లో మొత్తం 544 ఓట్లకు గాను, 444 ఓట్లు పోలయ్యాయి. బూత్ నంబర్ 205 లో మొత్తం 581 ఓట్లకు 457 పోలైనట్లు అధికారులు తెలిపారు. కాగా పోలింగ్ సమయం ముగిసేలోపు లోపల ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.

தொடர்புடைய செய்தி