ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ తహశీల్దార్ కు అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు రైతులకు 75 శాతం సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలను అందించాలని కోరుతూ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ నెలలోనే రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని, సన్న వడ్లకే కాకుండా దొడ్డువడ్లకు కూడా రూ. 500 బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.