పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి: డాక్టర్ అప్పయ్య

53பார்த்தது
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి: డాక్టర్ అప్పయ్య
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రిని డిఎంహెచ్ఓ అప్పయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డు, బాలింతల వార్డును పరిశీలించారు. వైద్యం పొందుతున్న రోగులు, బాలింతలకు అందుతున్న సేవల పట్ల ఆరా తీశారు. అప్పయ్య మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల డాక్టర్ ను ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி