మావోయిస్టులకు ప్రజలు సహరించద్దు: ఎస్సై రమేశ్

65பார்த்தது
మావోయిస్టుల వల్ల ప్రజలకు నష్టం తప్ప లాభం లేదని వాజేడు మండలం పేరూరు ఎస్సై రమేశ్ అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో గ్రామస్తులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. మావోయిస్టులు అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని అన్నారు. ఎవరైనా తమ గ్రామాల్లో అనుమానితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మావోయిస్టులకు సహాకారం ఇవ్వొద్దని అన్నారు.

தொடர்புடைய செய்தி