మల్లూరు దేవాలయంలో ములుగు జిల్లా కలెక్టర్ పూజలు

63பார்த்தது
మల్లూరు దేవాలయంలో ములుగు జిల్లా కలెక్టర్ పూజలు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామిని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తహశీల్దార్ వీరస్వామి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி