ముగిసిన మల్లూరు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

51பார்த்தது
ముగిసిన మల్లూరు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చివరిరోజు కావడంతో అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి అమ్మవార్ల విగ్రహాలకు వసంతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చివరిరోజు కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేశ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி