కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు వేసిన కొన్నాళ్ళకే పగుళ్లు ఏర్పడుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం వద్ద జాతీయ రహదారిని డబుల్ రోడ్డు నుండి ఫోర్-వేగా కన్వర్ట్ చేశారు. రహదారి నిర్మాణం చేసిన కొద్ది రోజుల్లోనే పగుళ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు శనివారం మీడియాకు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు పనులను చేపట్టేల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.