దేశానికి పెనుముప్పుగా మారుతున్న పొగాకు ఉత్పత్తులకు ప్రజలు దూరంగా ఉండాలని ములుగు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు నినాదాల ద్వారా వినిపించారు. అనంతరం ప్రధాన కూడళ్లలో పాన్ షాపులు కిరాణాషాపుల యజమానులకు పొగాకు ఉత్పత్తులను అమ్మడం మానేయాలని సూచించారు.