ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట గ్రామంలో వడదెబ్బతో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మంగపేట మండలంలోని రాజుపేట గ్రామానికి చెందిన దామెర రాంబాబు (ఎలక్ట్రిషియన్) శుక్రవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురయ్యాడు. అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. రాంబాబు అకాల మృతితో రాజుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.