108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం

61பார்த்தது
108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం
అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవించిన ఘటన శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. 108 ఈఎంటి నాగరాజు వివరాల ప్రకారం కన్నాయిగూడెం మండలం గురేవుల గ్రామానికి చెందిన సంధ్య అనే గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో 108లో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటి నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేశారు.

தொடர்புடைய செய்தி