మహబూబాబాద్ జిల్లాలో శనివారం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. సకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులందరి తరఫున సీఎం రేవంత్ రెడ్డికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న ధన్యవాదాలు తెలియజేశారు.