జిల్లాలో పెను విషాదం

573பார்த்தது
మహబూబాబాద్ జిల్లా గూడూరులో శుక్రవారం లారీ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. కర్రల లోడ్తో వెళ్తున్న లారీ మూల మలుపు వద్ద అదుపు తప్పి బస్సు స్టాప్ లో వేచి ఉన్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. కర్ర లోడు ఇద్దరు వ్యక్తులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవేందర్, కానిస్టేబుల్ పాపారావుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி