అనుమతి లేని పాఠశాలలను బహిర్గతం చేయాలి

79பார்த்தது
అనుమతి లేని పాఠశాలలను బహిర్గతం చేయాలి
జనగాం జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని పాఠశాలల వివరాలను, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల వివరాలను బహిరంగంగా వెల్లడించాలని భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటి సభ్యులతో కల్సి జనగామ కలెక్టరేట్ లో ఏఓ రవీందర్ కి వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దోసగాని సుమ, జిల్లా సహాయ కార్యదర్శి విఘ్నేష్ లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி