కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని జనగాం జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కల్సి వానాకాలం పంట గురించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.