భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరాలయంలో బుధవారం ఆలయ అధికారులు హుండీ లెక్కించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలలో 3 నెలల ఏడు రోజుల వ్యవధిలో భక్తులు కానుకల రూపంలో హుండీలలో వేసిన నగదును ఆలయాధికారులు హుండీలు విప్పి లెక్కించగా రూ. 21, 44, 464 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ మారుతి తెలిపారు.