తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ

50பார்த்தது
బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జయశీలతో పాటు పలువురు కాళోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహా నీయుడు కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி