ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి

82பார்த்தது
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శంషాబాద్ లో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలానికి చెందిన సంగి మహేష్ ఉమాదేవి దంపతులు ఉపాధి నిమ్మిత్తం శంషాబాద్ కు వచ్చి సిద్ధాంతిలో నివసిస్తున్నారు. విమానాశ్రయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళ్తుండగా సిద్ధాంతి బస్టాప్ వద్ద వేగంగా వచ్చిన ఓ కారు మహేశ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி