రాజీవ్ భీమా కెనాల్ కు గండి.. ఆందోళనలో రైతులు

67பார்த்தது
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాన్ గల్ మండలంలోని జమ్మపురం గ్రామ పరిధిలో ఆదివారం భారీ వర్షాల వల్ల రాజీవ్ భీమా కెనాల్ తెగిపోయింది. కెనాల్ తెగిపోయి నీరు దిగువకు ప్రవహిస్తుంది. బుసిరెడ్డి పల్లి జమ్మాపూర్ గ్రామాల మధ్య రోడ్డు తెగిపోయింది. ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేశామని నీరు ఇలా పోతే మళ్ళీ పంటలు ఎండి పోతాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి కెనాల్ పుననిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி