ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో ప్రజలు భాగస్వాములు కావాలి

54பார்த்தது
ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో ప్రజలు భాగస్వాములు కావాలి
నస్పూర్ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ ను సమూలంగా నిర్మూలించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని కోరారు. అనంతరం శ్రీరాంపూర్ లోని పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర చెత్తా చెదారం తొలగించి శుభ్రం చేశారు.

தொடர்புடைய செய்தி