మంచిర్యాల: వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో యుద్దోన్మాది దిష్టిబొమ్మ దగ్దం

85பார்த்தது
పాలస్తీనా, గాజా, ఇరాన్, లిబియాలపై అమెరికా, ఇజ్రాయిల్ యుద్దోన్మాదాన్ని ఆపాలని సోమవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ చౌరస్తాలో యుద్దోన్మాద దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ, యుద్దోన్మాదాన్ని ఆపి శాంతిని కాపాడాలని కోరారు. ఇజ్రాయిల్ కు మద్దతు ఇచ్చే విధానాలను భారత్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி