పిడుగు పడి 10 గోవులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల పరిధిలోని రేగులగూడెం పంచాయతీ రాళ్లచలక గ్రామంలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మేతమేస్తున్న 10 గోవులు పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. పాడి రైతులు పద్దం లక్క, మడకం జోగా, మడివి లక్క మృతి చెందిన గోవులను చూసి బోరున విలపించారు. పాడి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు.