కుంగిన సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించిన ఎంపీ

68பார்த்தது
జిల్లాలోనే అతిపెద్ద చెరువైన సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు కట్ట కుంగడంతో కుంగిన కట్టను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కుంగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సీపీఎం నాయకులు కట్ట కుంగడానికి గల కారణాలను ఎంపీకి తెలిపారు. పలు సమస్యల పరిష్కారం కొరకు వినతిపత్రాలను ఎంపీకి అందజేశారు.

தொடர்புடைய செய்தி