మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

61பார்த்தது
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే
ములకలపల్లి మండలంలో విద్యార్థుల ఆటోను ఢీకొన్న కారు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం రాత్రి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி