పెండింగులో ఉన్నవేతనాలు చెల్లించాలి

51பார்த்தது
పెండింగులో ఉన్నవేతనాలు చెల్లించాలి
రెబ్బెన మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు 7 నెలల పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించని పక్షంలో డిఎఫ్ ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. శుక్రవారం రెబ్బెన ఎఫ్ఆర్ఓ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ రాజేందర్ కి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி